సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్
కంది తహసిల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి ఓ వ్యక్తి బుధవారం హల్చల్ చేశారు. కాశీపూర్ గ్రామానికి చెందిన లక్ష్మయ్య తన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెల్ టవర్ ఎక్కారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని దిగాలని కోరారు. సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆయన సెల్ టవర్ దిగారు.