విద్యుత్ తీగలు తగిలి యువకుడికి గాయాలు

1564చూసినవారు
విద్యుత్ తీగలు తగిలి యువకుడికి గాయాలు
మొక్కజొన్న పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైర్ తగిలి యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం ములుగు జిల్లాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం ములుగు జిల్లా వాజేడు మండలం చల్వాయికి చెందిన అభినయ్ (18) ఇసుక పనికి వెళ్ళాడు. ఈ క్రమంలో మొక్కజొన్న పంటకు అమర్చిన విద్యుత్ తీగ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్