వసంత నవరాత్రి మహోత్సవంలో అమ్మవారికి పూలతో అర్చన చేస్తే కోరిన కోరికలు తీరుతాయని అర్చకులు నాగరాజు శర్మ తెలిపారు. ఆదివారం వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దేవాలయంలో వసంత నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారికి లక్ష లిల్లీ పూలతో పూజ చేశారు. పూలు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవని అందుచేత వసంత నవరాత్రిలో తొమ్మిది రోజులపాటు వివిధ రకాల పూలతో అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని అర్చకులు తెలిపారు.