లద్దాఖ్‌కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని కోరుతూ నిరాహార దీక్ష చేసినది ఎవరు?

51చూసినవారు
లద్దాఖ్‌కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని కోరుతూ నిరాహార దీక్ష చేసినది ఎవరు?
లద్దాఖ్‌కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని కోరుతూ ఇంజినీర్‌, విద్యా సంస్కరణవేత్త సోనమ్‌ వాంగ్‌ఛుక్‌ తాజాగా 21 రోజులపాటు నిరవధిక నిరాహార దీక్ష చేశారు. భారత ఈశాన్య సరిహద్దు కొసన ఉండే లద్దాఖ్‌కు పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని, స్థానికులకు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రత్యేకంగా ఓ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని, తమ ప్రాంతానికి ఇద్దరు ఎంపీలు ఉండాలని అక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్