దేశ రాజధానిలో ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు
పేర్కొంది. ఇందుకు సంబంధించిన పిటిషన్ను మే 7న విచారిస్తామని ఈడీకి తెలిపింది. ‘ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణను పరిశీలిస్తాం’ అని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.