AP: చంద్రబాబు రాక్షస పాలన చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. "ప్లాన్ ప్రకారమే ప్రమాణ స్వీకారానికి ముందే వైసీపీ నాయకుల ఆస్తులుపై దాడులు చేస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. దాడుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రధానికి, హోం మంత్రికి ఫిర్యాదు చేశాం. స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేస్తాం. ఈ దాడులకు బీజేపీ కూడా బాధ్యత వహించాలి." అని వైవీ వ్యాఖ్యానించారు.