ఏపీ ఎన్నికలకు సంబంధించి వెల్లడైన ఎగ్జిట్ పోల్స్పై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. "ఎగ్జిట్ పోల్స్లో లోకల్ సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయి. నేషనల్ సర్వేలు మాత్రమే కూటమికి ఆధిక్యం చూపిస్తున్నాయి. మాకు సైలెంట్ ఓట్లు పడ్డాయి. ప్రజలంతా వైసీపీ వెంటే ఉన్నారు. కూటమి నేతలు కౌంటింగ్లో అవకతవకలకు పాల్పడే అవకాశం ఉంది. వైసీపీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి." అని సజ్జల పిలుపునిచ్చారు.