ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ వెబ్సైట్ ‘ఈ ప్రగతి’ని పునరుద్ధరించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.18 కోట్ల బకాయిలు రాలేదని సర్వీస్ ప్రొవైడర్ సంస్థ ఓటీఎస్ఐ నిన్న సేవలు నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఓటీఎస్ఐ ప్రతినిధులతో అధికారులు చర్చలు జరిపారు. చర్చలు సఫలమవ్వగా వెబ్సైట్ను పునరుద్ధరించారు.