టెలికం కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. సైబర్ క్రైమ్లో పాలు పంచుకున్న 28,200 మొబైల్ ఫోన్లపై నిషేధం విధించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రకారం 28,200 మొబైల్ హ్యాండ్ సెట్స్ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యాయి. ఈ మొబైల్ హ్యాండ్ సెట్స్లో దాదాపు 20 లక్షల నెంబర్లను వినియోగించారు. రీవెరిఫికేషన్ అనంతరం ఈ సిమ్ కార్డులు అన్నింటిపై నిషేధం అమల్లోకి వస్తుంది.