ఇప్పటికే జాతుల మధ్య వైరంతో అట్టుడుకిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో అల్లర్లు ఆగడం లేదు. తాజాగా రాష్ట్ర రాజధాని ఇంఫాల్లో ముగ్గురు కూలీలపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగపడ్డారు. దీంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పశ్చిమ జిల్లాలోని నౌరెమ్థాంగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన కార్మికుడిని జార్ఖండ్కు చెందిన శ్రీరామ్ హంగ్సదా(41)గా గుర్తించారు.