బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్దేవ్ ఓటు వేసే సందర్భంగా ఈవీఎంను ధ్వంసం చేశాడు. దీంతో పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే అయిన ఆ అభ్యర్థిపై ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చిలికా బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్దేవ్ ఈసారి ఖుర్దా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు.