భారత్కు చెందిన నలుగురు వైద్యవిద్యార్థులు రష్యాలో ప్రమాదవశాత్తు వోల్ఖోవ్ నదిలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరి మృతదేహాలను అప్పుడే వెలికి తీయగా మిగతా ఇద్దరి మృతదేహాలను రష్యా అధికారులు తాజాగా స్వాధీనం చేసుకున్నారని మహారాష్ట్ర ప్రభుత్వ అధికారి శనివారం తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు.. హర్షల్ అనంతరావ్ దేసాలే, జిషాన్ అష్పాక్ పింజారీ, జియా ఫిరోజ్ పింజారీ, మాలిక్ గులామ్గౌస్ మహ్మద్ యాకూబ్.