భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దంపతులు శనివారం ఉదయం గుజరాత్ రాష్ట్రం ద్వారకలోని ద్వారకాదీశ్ ఆలయంలో ద్వారకాదీశుడిని దర్శించకున్నారు. ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న సీజేఐ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీజేఐ దంపతులు సంప్రదాయ పట్టు వస్త్రదారణలో ద్వారకాదీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.