కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు మొదలైంది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ కేటాయించారు. కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణం చేసిన గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖలను అప్పగించారు. నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా అవకాశం కల్పించారు. ఇక తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ కేటాయించారు.