ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు కోర్టులో బుధవారం చుక్కెదురైంది. ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు తనకు వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. బెయిల్ ఇచ్చేందుకు జడ్జి నిరాకరించారు. కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 19 వరకు పొడించారు.