ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో మూడు వికెట్లు కోల్పోవడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. టామ్ లేథమ్ (12), డారిల్ మిచెల్ (17) పరుగులతో ఉన్నారు. దీంతో 20 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ 101/3 పరుగులుగా ఉంది. భారత్ తన స్పిన్ మాయాజాలంతో కివీస్ రన్ రేట్ను అమాంతం తగ్గించింది. ఇప్పటి వరకు కుల్దీప్ రెండు, వరుణ్ ఒక వికెట్ తీశారు.