నటి హేమకు మరోసారి నోటీసులు

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తెలుగు సినీ నటి హేమకు బుధవారం పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. నటి హేమతో పాటు మరో 8 మందికి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. జూన్ 1న విచారణకు రావాలని నోటీసుల్లో బెంగళూరు సీసీబీ పేర్కొంది. కాగా, ఈ నెల 27న హేమకు విచారణ జరగనుండగా.. అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేదు.

సంబంధిత పోస్ట్