కేరళ సీఎం పినరయి విజయన్పై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ విమర్శలు గుప్పించారు. విజయన్ ‘రాజీ’ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కేరళ సీఎం కేవలం కాంగ్రెస్ పార్టీపైన, నా సోదరుడు రాహుల్గాంధీపైన మాత్రమే విమర్శలు చేస్తున్నారని, బీజేపీ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. పలు కుంభకోణాల్లో పాత్ర ఉండడంతో విజయన్ కేంద్రంతో రాజీకి వచ్చారని, అందుకే కేంద్రం ఆయనపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.