దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఫ్లాట్గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 31.68 పాయింట్లు పెరిగి 72,271.94 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 10.50 పాయింట్లు పెరిగి 21,741.90 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ప్యాక్ నుంచి నెస్లే ఇండియా, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, హెచ్సిఎల్ టెక్, ఐటీసీ లాభాల్లో, భారతీ ఎయిర్టెల్, ఎం అండ్ ఎం, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ నష్టాల్లో ఉన్నాయి.