మంత్రి పొన్నం ప్రభాకర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మధ్య ఎన్టీపీసీ ఫ్లై యాష్ వివాదం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ లోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్న కౌశిక్ రెడ్డి పొన్నంను రావాలని సవాల్ విసిరారు. పొన్నం రాకపోతే తప్పు ఒప్పుకున్నట్లేనని అన్నారు. బ్లాక్బుక్ను మంత్రి పొన్నం పేరుతోనే మొదలు పెట్టానని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని అన్నారు.