శ్రీవారి దర్శన టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను సోమవారం ఉదయం 10 గంటలకు ttdevasthanams.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. అలాగే తిరుపతిలలో ఆగస్టు నెల గదుల కోటాను ఈవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.