ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ధిక సాయం

59చూసినవారు
ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ధిక సాయం
జికెవీధి మండలం సప్పర్ల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో.. 10వ తరగతి చదువుతున్నా మోహన్ దాస్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మోహన్ దాస్ కు పెద్ద కర్మ చేయడానికి వారి కుటుంబ సభ్యులకు బుధవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కన్వీనర్ కె. రాజశేఖర్ ఆధ్వర్యంలో.. సప్పర్ల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిబ్బంది ద్వారా ఆర్ధికసాయం అందించారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలలో హెల్త్ వాలంటీర్ లేకపోవడం వల్లనే గిరిజన విద్యార్థులు చనిపోతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్