చిత్తూరులో రోడ్డుపై నిరసనలు
చిత్తూరులోని చర్చి వీధిలో కోదండ రాముని రథానికి భద్రత కల్పించాలని విశ్వహిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్య దర్శి వడివేలు, సిద్దు, ప్రజా సంఘాలు శుక్రవారం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఆలయ స్థలాన్ని అద్దెకు ఇవ్వడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. ఆలయ ఈవో నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపించారు. రథాన్ని భద్రపరిచేంతవరకు నిరసన కొనసాగిస్తామన్నారు.