నాగలాపురం వెస్ట్ దళితవాడకు చెందిన సునీత(24)కు మంగళవారం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో నాగలాపురం పీహెచ్సీలో సిబ్బంది ప్రథమ చికిత్స చేసి నగరి ఏరియా ఆసుపత్రికి రెఫర్ చేశారు. పైలట్ సతీశ్, ఈఎన్టీ నిరోషా నగరికి 108 వాహనంలో తరలించారు. నిండ్ర మండలం చవరంబాకం వద్ద వాహనాన్ని పక్కనపెట్టి కాన్పు చేశారు. సునీత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, తల్లి బిడ్డను సురక్షితంగా ఏరియా ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు.