సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎస్సై
పీటీఎం ఎస్ఐ రవీంద్రబాబు గురువారం సాయంత్రం మండలంలోని సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు, రూట్ మ్యాప్ లను పరిశీలించారు. ఎస్ఐ మాట్లాడుతూ. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ గొడవలు జరగకుండా ఉండేందుకు రూట్ మ్యాపులతో పాటు సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందన్నారు. ఎన్నికరోజు కేంద్ర పారా మిలటరీ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తామని ఎస్ఐ తెలిపారు.