అమలాపురం మండలంలోని కామనగరువు గ్రామంలో ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రహదారిపై వెళ్తున్న 2 ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. గాయాలపాలైన వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.