అన్నదాన ట్రస్ట్ కు రూ. 50, 000 విరాళం
సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో నిర్వహించు నిత్య అన్నదానం ట్రస్టుకు విజయవాడ వాస్తవ్యులు చినమూరి సదాశివరెడ్డి శనివారం రూ. 50, 000 విరాళంగా ఇచ్చారు. తొలుత దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం వీరికి ఆలయ సూపరింటెండెంట్ పి. విజయ సారధి స్వామివారి చిత్రపటం ప్రసాదాన్ని అందజేశారు.