![](https://media.getlokalapp.com/cache/5a/da/5adaa8811269707e4899630882e251c2.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
వారిపై చర్యలు తప్పకుండా తీసుకుంటాం
వైసీపీ ప్రభుత్వంలో కొందరు అధికార మదంతో దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ప్రభుత్వ సొమ్ములు కాజేయడం జరిగిందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అర్హత ఉంటే కరుడుగట్టిన వైసిపి వాళ్లకు కూడా పెన్షన్లు అందజేస్తామని అన్నారు. అయితే ఇలా అక్రమ మార్గంలో సర్టిఫికెట్లు సృష్టించి పెన్షన్ సొమ్ము కాజేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.