వేంపల్లె: వృషభాచలేశ్వర స్వామిని దర్శించుకున్న బీటెక్ రవి

76చూసినవారు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేంపల్లి సమీపంలోని ఎద్దుల కొండ వృషభాచలేశ్వర స్వామిని పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయనకు ఆలయ విశిష్టతను వివరించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని మాజీ పాలకమండలి సభ్యులు రమణ, ఆలయ ఈవో విశ్వనాథ్ రెడ్డి కోరారు.

సంబంధిత పోస్ట్