ఏలేరు, సుద్దగడ్డ వరద ముంపు బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. పిఠాపురం మండలం బి.ప్రత్తిపాడు, భోగాపురం, రాపర్తి, రాయవరం, కోలంక గ్రామాల్లో ఆయన మంగళవారం పర్యటించి ముంపు పొలాలను పరిశీలించారు. గొల్లప్రోలులో జగనన్న కాలనీ వాసులకు, సూరంపేట ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్టు తెలిపారు. ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణను కూటమి ప్రభుత్వం చేపడుతుందని హామీ ఇచ్చారు.