విద్యార్థులు విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి

60చూసినవారు
విద్యార్థులు విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి
విద్యార్థులు నిరంతరం వివిధ విషయాలపై పరిజ్ఞానం పెంచుకోవాలని తూ. గో. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ప్రకాష్ బాబు సూచించారు. రాజమండ్రి కేంద్రీయ విశ్వవిద్యాలయం హైస్కూల్లో మంగళవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. చదువుపై విద్యార్థులు ఆసక్తి కలిగి ఉండాలన్నారు. పిల్లల అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకొని కొందరు వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్