అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమీషనర్
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి పై అమ్మవారి నీ రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనర్ ఎస్ సత్యనారాయణ, ఐఏఎస్ ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు ప్రసాదములు, శేషవస్త్రం అందజేశారు.