ప్రతిమనిషికి రాజ్యాంగంలో సమాన హక్కులు కలిగి ఉంటాయని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. మంగళవారం కర్నూలు మండల ప్రజాపరిషత్ సమావేశ భవనంలో లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. మనదేశంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలన్నారు