
పార్వతీపురం: ఎన్నికల విధులపై అవగాహన తప్పనిసరి
ఈ నెల 27న జిల్లాలో జరగనున్న ఉత్తరాంద్ర ఉపాధ్యాయ ఎంఎల్సీ ఎన్నికలపై తప్పనిసరిగా పూర్తి అవగాహన ఉండాలని మన్యం జిల్లా రెవిన్యూ అధికారి కె. హేమలత పీఓ, ఏపీఓలకు ఉద్భోదించారు. ప్రీసీడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రీసీడింగ్ అధికారులకు రెండవ విడత శిక్షణ కార్యక్రమం డీఆర్ఓ అధ్యక్షతన సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. పోలింగ్ ప్రక్రియపై చక్కగా అన్వయించుకుని, ఎన్నికల విధులను పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు.