![రథోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై రథోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై](https://media.getlokalapp.com/cache/0a/d9/0ad967fd4d0e193b265e867fc362312b.webp)
రథోత్సవం ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై
పాతసింగరాయకొండలోని శ్రీ వరహాలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 23వ తేదీన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ రథోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఎస్సై శ్రీరామ్, ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం పరిశీలించారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.