వరద నీటిలో పశువుల ఆసుపత్రి

52చూసినవారు
జామి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో మండల కేంద్రంలో గల పశువుల ఆసుపత్రి అలాగే కార్యాలయంలోకి వర్షపు నీరు చేరింది. దీంతో ఆదివారం కార్యాలయాన్ని పర్యవేక్షించిన అధికారులు అప్రమత్తమై మందులు, రికార్డులను భద్రపరిచారు. కాగా పశువుల ఆసుపత్రి కార్యాలయం భవనం శిథిలావస్థకు చేరుకోవడమే కాకుండా లోతట్టు ప్రాంతంలో ఉందని ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించినట్లు పశు వైద్యాధికారి అప్పలనాయుడు తెలిపారు.

సంబంధిత పోస్ట్