ఎస్ కోట మండలంలో ఎడతెరిపిలేని వాన

70చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఎస్ కోట మండలంలో శనివారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. ఈ నేపథ్యంలో మండలంలో గల చెరువులు జలకళను సంతరించుకున్నాయి. రాత్రి నుండి కురుస్తున్న వర్షం కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమైపోయారు. దీంతో బలంగా గాలులు వియడంతో పెద్దలతో పాటు చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. కాగా తుఫాన్ నేపథ్యంలో అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్