నీట మునిగిన కొత్తవలస కాంప్లెక్స్ పరిసరాలు

83చూసినవారు
గత మూడు రోజుల నుండి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు కొత్తవలస ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాలు ఆదివారం నీట మునిగాయి. కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా కాంప్లెక్స్ పక్కన గల మిల్లులో వరద నీరు భారీగా చేరడంతో లక్షల విలువైన కలప, యంత్ర సామగ్రి నీట మునిగాయని సా మిల్లు యజమానులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్