పెందుర్తి
అప్పన్న చందనోత్సవంలో స్వరూపానందేంద్ర
విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో అప్పన్న చందనోత్సవం శుక్రవారం తెల్లవారుజామున ఘనంగా ప్రారంభమైంది. శుక్రవారం తెల్లవారుజామున శ్రీ స్వామి వారిని శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి మహాస్వామి, శ్రీ సాత్మకానంద స్వామి దర్శించుకొని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు స్వామీజీలకు ఘన స్వాగతం పలికారు.