

అరకు: బాడీబిల్డింగ్లో ప్రతిభ చూపిన అప్పారావు
31వ మిస్టర్ ఆంధ్ర బాడీబిల్డింగ్ ఛాంపియన్షిప్ లో అరకులోయకు చెందిన పిన్నింటి అప్పారావు మాస్టర్స్ విభాగంలో ప్రథమ స్థానం పొందారు. ఈ పోటీలు ఆంధ్ర బాడీబిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన మన్యం జిల్లా పార్వతీపురం లో జరిగాయి. ఈ పోటీలలో పలు జిల్లాల బాడీబిల్డర్లు పాల్గొన్నారు. కాగా పిన్నింటి అప్పారావు మాస్టర్స్ విభాగంలో ప్రథమ స్థానం పొంది షీల్డ్, మెడల్, ప్రైజ్ అందుకున్నారు.