భీమిలి నియోజకవర్గం మదురవాడలో అర్బన్ ప్రైమరి హెల్త్ సెంటర్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. గెజిటెడ్ సంతకం కోసం డబ్బులు డిమాండ్ చేసినట్టు మంగళవారం విద్యార్థినులు ఆరోపించారు. చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో 10TH విద్యార్థులకు పరీక్షల నిమిత్తం ప్రభుత్వ వైద్యుల సంతకాలు అవసరమైంది. ఈమేరకు వైద్యురాలిని సంప్రదించగా ఒక్కో విద్యార్థి రూ. 300 ఇస్తే సంతకం చేస్తానని ఉద్యోగి సన్యాసి నాయుడు అన్నారని విద్యార్థులు ఆరోపించారు.