
భీమవరం: గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి
ఈనెల 26న భీమవరం కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్లో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వశిష్ట సమావేశ మందిరంలో గణతంత్ర వేడుకలకు సంబంధించి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వేదిక ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడం ఆహుతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నారు.