
భీమవరం: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
భీమవరం వన్ టౌన్ పట్టణం రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం చేపల కంటైనర్ లారీ ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సోమవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వృద్ధురాలిని గుర్తించిన వారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఏఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు.