జర్నలిజాన్ని, జర్నలిస్టులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది
జర్నలిజాన్ని, జర్నలిస్టులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏపీడబ్ల్యూజేఎఫ్ సీనియర్ నాయకులు కె బాలశౌరి అన్నారు. ప్రపంచ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించు కుని కార్మికవర్గ స్పూర్తితో ‘‘జర్నలిజాన్ని కాపాడండి `జర్నలిస్టులను రక్షించండి’ అనే నినాదంతో శుక్రవారం సాయంత్రం ఏలూరు జిల్లా పరిషత్ ప్రాంగణంలో దేశ నాయకుల విగ్రహాల ఎదుట ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.