మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలో 44వ జాతీయ రహదారి శనివారం రద్దీగా మారింది. ఉగాది రంజాన్ పండుగలను పురస్కరించుకొని హైదరాబాదు నుంచి జోగులాంబ గద్వాల, వనపర్తి, మక్తల్, దేవరకద్ర, నారాయణపేట, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, ఆలంపూర్ తదితర ప్రాంతాల ప్రజలు తమ సొంత గ్రామాలకు వెళ్తుండడంతో జాతీయ రహదారి రద్దీ సంతరించుకుంది. ఆదివారం ఉగాది, సోమవారం రంజాన్ ఉండడంతో రెండు రోజులపాటు సెలవు రావడం జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది.