
మహబూబ్ నగర్ జిల్లాకు 24వ స్థానం
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులు తమ సత్తా చాటారు. మొత్తం 12,737 మంది పరీక్షలు రాయగా 11,706 మంది పాసయ్యారు. 6,524 మంది బాలురు పరీక్షలు రాయగా 5,856 మంది పాసై 89.76 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 6,213 మంది బాలికలు పరీక్షలు రాయగా 5,850 మంది పాసై 94.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం మీద 91.91 శాతంతో మహబూబ్ నగర్ జిల్లా స్టేట్ 24వ స్థానంలో నిలిచింది.