కిషన్ రెడ్డికి మద్దతుగా మాజీ మేయర్ ప్రచారం
సికింద్రబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి మద్దతుగా బీజేపీ మాజీ మేయర్ బండా కార్తీక చంద్రారెడ్డి శనివారం ప్రచారం చేశారు. తార్నాక డివిజన్ లో ఇంటింటికి తిరుగుతూ కిషన్ రెడ్డికి మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కేంద్రంలో మోడీ సర్కార్ ఉండాలంటే ఇక్కడ కిషన్ రెడ్డి గెలవాలన్నారు. ప్రచారంలో పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.