ఎన్నికల కోడ్ ఉన్న జెండా గద్దెలకు ముసుగు వేయాలె
పిట్లం మండలంలోని బొల్లక్ పల్లి గ్రామంలో గురువారం ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన జెండా దిమ్మెకు ముసుగు వేయడం మరిచారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో విగ్రహాలకు, జెండా దిమ్మెలకు ముసుగు వేయాల్సిన అధికారులు తమ పనితీరు పట్ల నిర్లక్ష్యం వహించడం పట్ల అసహన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జెండా దిమ్మెలకు ముసుగు వేయాలని, ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.