వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూటమి ప్రభుత్వం షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. వైసీపీ హయాంలో టీడీపీ నేత కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కోడెల ఆత్మహత్య చేసుకోవడానికి విజయసాయిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కారణమని విమర్శలు వచ్చాయి. అయితే అప్పుడు వైసీపీ అధికారంలో ఉండడంతో వారి జోలికి వెళ్లలేదు. ఆ కేసులో ఇప్పుడు విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసే అవకాశం లేకపోలేదని టీడీపీ నేతలు తెలుపుతున్నారు.