సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీశ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విజయవాడ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నిందితుడి తరఫు న్యాయవాది సలీం వాదనలు వినిపిస్తూ.. సతీశ్ను పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించారని కోర్టుకు తెలిపారు. విచారణ అనంతరం తీర్పును న్యాయమూర్తి రిజర్వు చేశారు. దీనిపై మంగళవారం ఉత్తర్వులు వెల్లడించే అవకాశముంది.